English | Telugu

కాంతార ని వెనక్కి నెట్టిన మూవీ.. దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్ 

రిషబ్ శెట్టి ప్రస్తుతం 'కాంతార చాప్టర్ 1'(Kantara Chapter 1)తో రికార్డుల వేట కొనసాగిస్తున్నాడు. ఇప్పటి వరకు సుమారు 350 కోట్ల రూపాయల్ని రాబట్టినట్టుగా తెలుస్తుంది. చాప్టర్ 1 కాంతార కి ప్రీక్వెల్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే. కాంతార కూడా ఎవరి ఊహలకి అందని విధంగా సంచలన విజయాన్ని నమోదు చేసింది. నేటికీ ఓటిటి వేదికగా ఐఎండిబి లో 8 .2 రేటింగ్ తో దూసుకుపోతుంది.

కానీ ఇప్పుడు కాంతార ప్లేస్ ని 'వడ చెన్నై'(vada Chennai)ఆక్రమించింది. ఈ చిత్రం ఐఎండిబి లో 8.4 రేటింగ్‌ని పొందడమే ఇందుకు ఉదాహరణ. 2018 లో విడుదలైన వడ చెన్నై అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. క్రైమ్ డ్రామాగా తెరకెక్కగా, చెన్నై లోకల్ వాతావరణాన్ని ప్రతిభింబించింది. మన ఊహకి అందని విధంగా క్యారక్టర్ లు రన్ అవుతుండటం ఈ చిత్రం స్పెషాలిటీ. సన్నివేశాల్లో ఉత్కంఠత పీక్ లో ఉంటుంది. క్యారక్టర్ లు సైతం సినీ పక్కీలో సాగకుండా, నిత్యం మన కళ్ళ ముందు తిరుగుతుండే విధంగా ఉంటాయి. సదరు క్యారక్టర్ ల వస్త్ర ధారణ కూడా మాములుగా ఉంటుంది. అందుకే విడుదలై ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా, ఓటిటి లో టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది.

కథ విషయానికి వస్తే అంబు క్యారమ్ లో నెంబర్ వన్ ఆటగాడు. కొన్ని పరిస్థితుల కారణంగా స్థానిక మాఫియా ముఠాలో చేరతాడు. దీంతో అతడి జీవితంలో సంభవించిన అనేక మలుపుల ఆధారంగా బేస్ చేసుకొని వడ చెన్నై రూపొందింది. అంబు మాఫియాతో ఎందుకు చేతులు కలపాల్సి వచ్చింది అనే విషయం తెలిసాక, ఎంతో థ్రిల్లింగ్ కి లోనవుతాం.చెన్నై స్థానిక రాజకీయాలు కూడా ప్రధాన ఆకర్షణ. వెట్రిమారన్ సహజమైన దర్శకత్వ ప్రతిభకి చూపు కూడా పక్కకి తిప్పుకోము. అంబుగా ధనుష్ నటన ఒక రేంజ్ లో ఉంటుంది.ధనుష్ అగ్ర హీరో అవ్వడానికి కూడా ఈ చిత్రం ఒక కారణం. మిగతా క్యారక్టర్ లలో చేసిన ఐశ్వర్య రాజేశ్,ఆండ్రియా జెరెమియా, డేనియల్ బాలాజీ, సముద్ర ఖని, అమీర్ వంటి ప్రతిభావంతుల నటన కట్టిపడేస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video)లో అందుబాటులో ఉంది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.